కాముని వనిత, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు.
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల). దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అందించిన సేవలు మరువలేనివని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు. మంగళవారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రమటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందిన వెనుక రాజీవ్ గాంధీ ముందు చూపు ఉందని కాముని వనిత అన్నారు. ఆయన అందించిన సేవలు మరువలేనిమని తెలిపారు. కార్యక్రమంలో రమాదేవి, హారిక రెడ్డి, రాజ్యలక్ష్మి, అరుణ, సరిత, రోజా తదితరులు పాల్గొన్నారు.
