తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలాల మరియు మెట్ పల్లి పట్టణానికి చెందిన 9,14,000/- తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయల విలువ గల 53 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
ఈ కార్యక్రమంలో వారితోపాటు మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, మండలాల అధ్యక్షులు నల్ల తిరుపతి రెడ్డి, ఎల్లాల దశరథ్ రెడ్డి, తోట శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కంఠం రమేష్, జాజాల జగన్, దేవా మల్లన్న, జెడి సుమన్, నోముల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.