తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ సింహపురి కాలనీ లో సుమంత్ & అఖిల్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "చిత్రం"కేఫే ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కాలాలకతీతంగా ఎటువంటి వాతావరణం లోనైనా నడిచే ఏకైక వ్యాపారం "కెఫే" అని, నూతన రుచులను వినియోగదారులకు అందించినప్పుడు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
.