"చిత్రం" కెఫెను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ సింహపురి కాలనీ లో సుమంత్ & అఖిల్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "చిత్రం"కేఫే ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కాలాలకతీతంగా ఎటువంటి వాతావరణం లోనైనా నడిచే ఏకైక వ్యాపారం  "కెఫే" అని, నూతన రుచులను వినియోగదారులకు అందించినప్పుడు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

.