సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మే 1వ తేదీన ఉదయం 9 గంటలకు బస్ స్టాండ్ ఆవరణలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పాత్రికేయులతో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొటున్నారన్నారు. చుట్టుపక్కల గ్రామాల సిపిఐ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
