"బేసిక్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ & ప్రాజెక్ట్ రిపోర్ట్ "పుస్తకం ఆవిష్కరణ :

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ  కళాశాలకు చెందిన కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ బూర్ల నరేశ్, కరీంనగర్ కు చెందిన కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ గుండా శ్రీనివాస్ లు రచించిన "బేసిక్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ & ప్రాజెక్ట్ రిపోర్ట్  "పుస్తకాన్ని  ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మూర్తి  ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ  పరిశోధన పరిజ్ఞానం అవసరమని ఈ పుస్తకం తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల 

బి. కామ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు  వై. రామ కృష్ణ, వి.శ్రీకాంత్,  అనంత కుమార్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

పుస్తక రచయిత డా . బూర్ల నరేష్ కు  కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ ఎన్. వాసవి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు.

.