వర్చువల్ గా పీఎం-సూరజ్ పోర్టల్ ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా సామాజిక అభ్యున్నతి, ఆధారిత ప్రజాసంక్షేమానికి పీఎం-సూరజ్ పోర్టల్ ను (PM-SURAJ) పీఎం మోడీ వర్చువల్ గా బుధవారం  ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 510 జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఐఐటీ  హైదరాబాద్ నుండి రాష్ట్ర గవర్నర్ తమిలిసై, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా పరిషత్  చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి , ఐఐటీ డీన్ చంద్రశేఖర్ శర్మ, అదనపు కలెక్టర్  చంద్రశేఖర్, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సీజీఎం రాజేష్ కుమార్, కెనరా బ్యాంకు డీజీఎం ఆర్.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.   

రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి రోజు ఏదో ఒక లబ్దిదారులతో పథకాలపై మాట్లాడుతూ వారిని పథకాలలో భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) పథకం, సామాజిక న్యాయం,  సాధికారత మంత్రిత్వ శాఖ,  గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త చొరవతో మానవీయ మురుగు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ప్రమాదకర అభ్యాసాన్ని తొలగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతుందని అన్నారు. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ సాధికారతచే నిర్వహించబడిందని, ఇందులో ప్రధానమంత్రి మూడు జాతీయ కార్పొరేషన్‌లు (నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ NBCFDC, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్) కొత్త రుణగ్రహీతలతో సంభాసించారు. ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్, NAMASTE పథకం యొక్క లబ్ధిదారులు, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్పొరేషన్‌ల సమూహం (షెడ్యూల్డ్ కులాలు, సఫాయి కర్మచారిలు, వెనుకబడిన తరగతులు,  మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు) లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాసించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

.