సమ్మె బాట పట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బకాయి ఉన్న మొత్తం బిల్లును వెంటనే చెల్లించాలని తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించే వరకు సమ్మె విరమించబోమని  వారు డిమాండ్ చేశారు. జిల్లాలో వేలాది మంది మధ్యాహ్న భోజన నిర్వాకులు అనేక సమస్యలను  ఎదుర్కొంటున్నామని కార్మికుల అధ్యక్షులు భూమయ్య తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మధ్యాహ్న  భోజన కార్మికులను సమస్యలను పరిక్షించకపోవడం పై  ఆవేదన గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్యాహ్న  భోజన కార్మికుల   సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతో ఉన్నాము కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల అధ్యక్షులు భూమయ్య, సజితా బేగం, లక్ష్మీ, అనిత, మహానంద, కృష్ణవేణి, విజయలక్ష్మి, శోభా, సావిత్రి, ఏం. సావిత్రి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

.