నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల వితరణ

ఇప్పటివరకు 1037 పుస్తే మట్టెల పంపిణీ

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పుస్తే మట్టెలు బుధవారం వితరణ చేశారు,              ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య  పుష్ప దంపతుల కూతురు  సౌందర్య కు   మాతల్లి దండ్రులు కీర్తి శేషులు  నేవూరి లక్ష్మి  మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం పుసై మెట్టెలు  వితరణ చేశారు, ఇప్పటి వరకు 1037 పుస్తె మట్టెలను నిరుపేద యువతుల పెళ్ళిలకు  పంపిణీ చేయడం జరిగిందని నేవూరి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు, ఈ పుసై మట్టెల వితరణ కార్యక్రమం లో జర్నలిస్ట్ ఎదురుగట్ల ముత్తయ్య గౌడ్ , మాజీ  వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్,    పరికి శ్రీనివాస్  , అంకాశి రాజేష్ , తదితరులు పాల్గొన్నారు,

.