సమ సమాజ నిర్మాణానికి వీరుల త్యాగాలను స్మరించుకోవాలి

సిపిఐ రాష్ట్ర నాయకులు ఎసురత్నం,ఎం.డి.యూసఫ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని జగద్గిరిగుట్ట వ్యవస్థాపక సభ్యులు సి.పి.ఐ సీనియర్ నాయకులు కా"విద్యాసాగర్  24వ వర్ధంతి సందర్భంగా సి.పి.ఐ రాష్ట్ర నాయకులు యేసురత్నం , ఎం.డి.యూసఫ్ లు హాజరై వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట వాటర్ ట్యాంక్ ఏర్పాటుకి, జిల్లాల వారీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ,పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని, సమసమాజం స్థాపనకు పోరాడిన, తన పాటల , ఆటల ద్వారా వారు నిత్యం ప్రజా చైతన్యానికి కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు.రేపటి తరం నిరంతరం అమరుల త్యాగాలను స్మరించుకుంటూ పోరాట పటిమను అవలంభించుకొని మన సమాజాన్ని బహుజన న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం పోరాడాలని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని కావున యువకులు శ్వచమైన రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిగురు వెంకటేష్, నారాయణ మేస్త్రి,పి.నర్సయ్య,యాదగిరి,కార్యకర్తలు సిపిఐ మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య, ఏ.ఐ.టి.యు.సి కార్యదర్శి వుజీని హరినాథ్ రావు,ఎం.సహదేవరెడ్డి,కొమ్ము వెంకటేష్, సదానందం,జానకిరామ్,ప్రజానాట్యమండలి కళాకారులు డప్పు రామస్వామి,ఇంటి వెంకటరెడ్డి,దొరవి బాబు, జల్ల వెంకటేష్,గంగాధర్ రావు, తొండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

.