తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణం స్థానిక పద్మశాలి కళ్యాణమండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..మొన్న జరిగినా ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గెలిచినప్పటికిని నైతికంగా తానే విజయం సాధించానని అన్నారు. తన కోటరిని అడ్డుపెట్టుకొని మద్యంతో, మందుతో, ఓటర్లను ప్రభావితం చేశాడని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ అభివృద్ధి ఏం చేయలేదని, దానికి ఉదాహరణ మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 12 మంది రెబల్ అభ్యర్థులు కేటీఆర్ కు వ్యతిరేకంగా నిలబడి విజయం సాధించారని అన్నారు. దీనిబట్టి చూస్తే కేటీఆర్ కు ఇక్కడ ఎంత వ్యతిరేకత ఉందో? అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ రుణం తీర్చు కునేందుకు ,తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు అని తెలిపారు.కేటీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదనీ.ఒకప్పుడు కేటీఆర్ వచ్చిన మెజారిటీ కి ఇప్పటి మెజారిటీ కి చాలా వ్యత్యాసం ఉంది అని తెలిపారు. ఇక్కడ ఉన్న వ్యాపారులను సైతం కేటీఆర్ భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. కేటీఆర్ సిరిసిల్ల లో ఉన్న అన్ని రకాల మాఫియా లను పెంచి పోషిస్తున్నాడు అని అన్నారు.కేటీఆర్ చుట్టూ,దొంగ నోట్ల, వ్యాపారం చేసే వ్యక్తులు,బతుకమ్మ చీరల మాఫియా వ్యక్తులు ,ఇసుక మాఫియా వ్యక్తులు,లాండ్ మాఫియా వ్యక్తులు ఉన్నారనీ విమర్శించాడు.ఈ అన్ని మాఫియా లకు కేటీఆరే నాయకుడని విమర్శించారు. 15 సంవత్సరాలుగా సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో లేని కేటీఆర్, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే సిరిసిల్ల ప్రజలకు వారానికి రెండు రోజులు కేటాయిస్తానని ఉత్తరప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశాడు.
సిరిసిల్ల లో ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని తెలిపారు. రానున్న అన్ని రకాల ఎన్నికల్లో వాడవాడల కాంగ్రెస్ జెండా ఎగరవేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్రకాష్ ,ఎల్ల లక్ష్మీనారాయణ, గడ్డం నరసయ్య, తదితరులు పాల్గొన్నారు
.