మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): పదేళ్లగా మెదక్ పట్టణం ప్రగతి బాటన నడిపిస్తున్నా... ఈ ప్రాంత ఆడబిడ్డను... ప్రజల కష్టాసుఖాలు నాకు బాగా తెలుసు.. ఆపదలో అండగా నిలుస్తున్నా... పదేళ్ల చిన్న పిల్లోడు నుంచి వందేళ్ళ పెద్ద వాళ్ళ వరకు నన్ను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. మీ ఇంటి ఆడపడుచుగా మరోసారి నన్ను ఆదరించి గెలిపించాలని మెదక్ టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఓటర్లను కోరారు. గురువారం మెదక్ పట్టణంలోని 9,11,26,27 తదితర వార్డుల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు తమ ఇంటి ఆడబిడ్డగా గౌరవిస్తూ ఇళ్లలోకి తీసుకువెళ్లి కుంకుమ, పసుపు అందజేశారు. శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మెదక్ పట్టణం అభివృద్ధిలో ఎంత వెనుకబడిపోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పేద ఇంటి ఆడపిల్లల పిల్లల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, గీతా, చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు మేడి కళ్యాణి, జయశ్రీ,సుంకయ్య, సమియొద్దీన్,గడ్డమీద యశోద,శేకమ్మ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్ మాజీ కౌన్సిలర్ చంద్రకళ, నాయకులు రాగి. అశోక్, లింగారెడ్డి,దుర్గాప్రసాద్, మధుసూదన్ రావు, శివరామకృష్ణ కొండ శ్రీనివాస్,జగదీశ్వర్,మధు జుబేర్, సంగ. శ్రీకాంత్ , ఫాజిల్ పాపయ్య, కిరణ్, ప్రసాద్, అరవింద్, చందు పాషా తదితరులు పాల్గొన్నారు.
.