తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం, పోచంరాల్ వద్ద గల పోలీస్ చెక్ పోస్ట్ ను ఆదివారం జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ IRS పరిశీలించారు . సాయుధ దళాలకు , తనిఖీ బృందాలకు పలు సూచనలు చేశారు. చెక్ పోస్ట్ వద్ద గల సి సి కెమెరాలు , 24 గంటలు పనిచేయాలని , ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు .
అనంతరం హవేలీ ఘనపూర్ మండలంలోని ఔరంగాబాద్ తండా , కొచ్చెర్వు తండా , లింగాపూర్ తండా , పాటిగడ్డ తండా ల్లో జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ IRS పర్యటించారు . ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ, ఓటుహక్కు వున్నా, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటును వినియోక్గించుకోవాలని అన్నారు. యువకులు నూతన ఉత్సాహంతో ఓటు వేయాలని అన్నారు.
జిల్లాలో బి ఎల్ ఓ లు ఓటరు సమాచార స్లిప్లు పంపిణి చేస్తున్నారని, ఓటరు సమాచార స్లిప్ తో పాటు ఓటరు గైడ్ , C- విజిల్ కరపత్రాన్ని అందిస్తున్నారని , ప్రజలందరూ ఎన్నికలనియమావళి తెలుసుకోవాలని అన్నారు . C - విజిల్ ఆప్ , టోల్ ఫ్రీ నెంబర్ 1950 ముఖ్యఉద్దేశాన్ని ప్రజలకు వివరంచారు . ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే , C -విజిల్ ఆప్ ద్వారా , పిర్యాదు చేయవచ్చని , పిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు .
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
.