తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని హిందూ సంఘాల ఐక్య వేదిక పిలుపుమేరకు బంగ్లాదేశ్ లోని హిందువులపై దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ,హిందువులకు మద్దతుగా కోటగిరిలోని దుకాణ సముదాయాలను,విద్య సంస్థలు,హోటలు బందు పాటించి హిందు సంఘాల నాయకులకు మద్దతు తెలిపారు అనంతరం హిందూ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శాంతియుతంగా నిరాసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నవీన్,ఉమాకాంత్ దేశాయ్, శ్రీనివాస్, రాజు, భూమయ్య, సతీష్ ,హనుమాన్లు, సాయిలు, గంగాధర్ ,శ్రీకాంత్, సంజీవ్, రమేష్, ప్రశాంత్ ,తదితరులు పాల్గొన్నారు.
