జువ్వాడి కృష్ణారావు జన్మదినం సందర్భంగా బియ్యం వితరణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు జన్మదినం పురస్కరించుకొని  కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం రేగుంట సమీపంలో ఉన్న నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి, చిట్ మెల్లి రంజిత్ గుప్తా, వృద్ధాశ్రమ నిర్వహణ బాధ్యులు మహిపాల్ రెడ్డి ఆశ్రమంలో ఉంటున్న వృద్దులు తదితరులు పాల్గొన్నారు

.