తెలంగాణ ప్రభ (కోరుట్ల): సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు అభినందన సి ప్రభాకర్ గ్రంథాలయం మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు
ఈ గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థుల ప్రతిభను వెలుగు తీసి ఉద్యోగం సంపాదించి వారికి మంచి అభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొన్నారు
ఇకముందు కూడా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు పేపర్స్ అనేక విధాలుగా ప్రిపేర్ అవడానికి ఇస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్న అనిల్, గ్రంథాలయం కమిటీ గౌరవాధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాస భూమయ్య, ఉపాధ్యక్షులు సుతారి రాములు, కార్యదర్శి గోడికే రాజు, గంగామణి, గ్రంథాలయం ఫౌండర్ మహమ్మద్ మౌలానా, చింత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగం సంపాదించిన విద్యార్థులు నారవేణి వేణు, కుందారపు విజయ్, జిందం అజయ్ కుమార్, వడ్లకొండ సంజయ్ కుమార్, వీరందరికీ సన్మానం చేశారు.
.