వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ముడుపు విప్పిన రైతులు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట) : ఎల్లారెడ్డి పేటలో గల రావి చెట్టు హన్మాండ్లు కు పంటలు పొట్ట దశకు ఉన్నప్పుడు రాళ్ల వర్షం కురవకుండా ఉండడం కోసం రావి చెట్టు హన్మాండ్ల ఆలయంలో ముడుపు వేయడం జరిగింది.అట్టి ముడుపును నేడు రైతుల ఆధ్వర్యంలో పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ద్వారా ముడుపును  విప్పారు.త్వరగా వర్షాలు కురవాలని హన్మాండ్లను రైతులు వేడుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం రైతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.రేపు సాయంత్రం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న బండ్ల బోనాల కార్యక్రమం నిర్వహణ జరుగుతుందనీ రైతులు తెలిపారు.

.