గడపగడపకు బిజెపి ప్రచారం

తెలంగాణ ప్రభ ( కోటగిరి): పోతంగల్ మండలంలోని చేత నగర్ గ్రామంలో రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి మక్కయ్య యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు తిరుగుతూ బిజెపి పార్టీ  పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టబోయే పథకాలపై ఓటర్లకు వివరించారు. వారు మాట్లాడుతూ..దేశం కోసం మోడీ  మోడీ కోసం మనం  అనే నినాదంతో గ్రామంలోని ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మూడోసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీబీ పటేల్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. ఈ ప్రచారంలో పాల్గొన్నవారు శక్తి కేంద్ర ఇంచార్జ్ సందీప్ బూత్ అధ్యక్షులు సునీల్ గంగుబాయి శివ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.