గుండెపోటుతో ఎక్సైజ్ ఎస్ఐ కాళి ప్రసాద్ మృతి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కాళి ప్రసాద్ నీకు (58)  గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్ గత మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటకు బదిలీపై వచ్చారు. 

ఎల్లారెడ్డిపేటలో తను అద్దె ఇంటిలో నివాసమై ఉంటున్న ఇంట్లో వికతజీవిగా పడి ఉన్నాడు.సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం మృతునికి భార్య పిల్లలున్నారు. సమాచారం అందుకున్న  ఎక్సైజ్  డిపార్ట్ మెంట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు,

ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కాళి ప్రసాద్ మృతి పట్ల   స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ప్రగాఢ సంతాపం ప్రకటించారు ,

.