కోరుట్లలో మొబైల్ చలివేంద్రాన్ని ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు...

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని షేక్ హుస్సేన్ అండ్ బ్రదర్స్ గ్యాస్ వెల్డింగ్ వారి సౌజన్యంతో ఎంఏ రహీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్ చలివేంద్రాన్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ ప్రజలకు,బాటచారులకు, ప్రయాణికులకు మొబైల్ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని ఫిల్టర్ నీళ్లను అందిస్తూ, దాహం తీరుస్తున్న షేక్ హుస్సేన్ అండ్ బ్రదర్స్ అధినేత ఎం.ఏ రహీం ను అభినందించారు. 

ఈ సందర్భంగా ఎం.ఏ రహీం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మేము ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నామని, ఇదివరకు మట్టి కుండల ద్వారా త్రాగునీరు అందించే వారమని, ప్రస్తుతం ప్రజల సౌకర్యం కొరకు ఆధునిక టెక్నాలజీతో మొబైల్ చలివేంద్రంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆటోమేటిక్ కూలింగ్ టెక్నాలజీని ఏర్పాటుచేసి చల్లని త్రాగునీరు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కోరుట్ల పట్టణంలో ఇస్తేమలకు, గణేష్ నిమర్జనానికి, జాతరలకు, ప్రజల కొరకు ఈ మొబైల్ చలివేంద్రం ద్వారా ఉచితంగా త్రాగునీరుని అందిస్తామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎం.ఏ నయీమ్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు వసీం,ముఫ్తీ ముజీబుర్ రహీమన్, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, ఎంబేరి సత్యనారాయణ,  ముబిన్, చిట్యాల లక్ష్మీనారాయణ, చిలువేరి విజయ్, తక్కూరి  భాస్కర్, అబిద్, ఇల్యస్,అన్వర్,షకీల్,సల్మాన్,సమీర్,ఫర్హాన్,బషీర్, తదితరులు పాల్గొన్నారు

.