తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లు తంగా లక్ష్మా రెడ్డి,కే జైరాం, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రషీద్,సీనియర్ నాయకులు వల్లెపు కృష్ణ గౌడ్,మీర్జా రషీద్ బేగ్, మువ్వా రవికిరణ్ , కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
