వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రాములోరి పెళ్లికి పట్టు వస్త్రాలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): శ్రీరామ నవమి సందర్భంగా కోరుట్ల పట్టణంలో శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రములు, తలంబ్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అధ్యక్షురాలు బూస మాధురి, కార్యదర్శి వెలుగూరి భాగ్య, కోశాధికారి జనగాం మధురిమ, జిల్లా ఇన్చార్జి నీలి లక్ష్మీ, లయన్స్ క్లబ్ జెర్సీ అల్లాడి శోభ మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

.