సామాజిక కార్యకర్త పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) వేసవికాలంలో నీటి కొరత ఉండకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ మరో బెంగళూరు కాకూడదని, సామాజిక కార్యకర్త పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో సాధారణంగా నీటి కొరత ఏర్పడుతుంది కానీ ఈసారి మరీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సోమవారం సూరారం లోని నార్త్ సిటీ స్కూల్ లో నీటిని ఏ విధంగా పొదుపు చేయాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో నీటిని పొదుపుగా వాడుతామని భవిష్యత్తులో నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో నార్త్ సిటీ స్కూల్ యజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
