పోపా ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పట్టణ పోపా ఆధ్వర్యంలో హోలీ వేడుకలను నిర్వహించారు ఇట్టి హోలీ వేడుకలకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

న్యాచురల్ కలర్ లతో హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు అనంతరం జువ్వాడి నర్సింగరావు కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇట్టి హోలీ వేడుకల్లో జువ్వాడి నర్సింగరావు తో పాటు పోపా నాయకులు అందె శివప్రసాద్,బోగ శ్రీధర్ నరేష్   పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం   ఆడెపు మధు,  పద్మశాలి సంక్షేమ సంఘం నేతలు రుద్ర శ్రీనివాస్, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, దండవేని వెంకట్, చిలువేరి విజయ్,  ఎంబెరి సత్యనారాయణ, వాసం అజయ్, మార్గం  ప్రతాప్ రెడ్డి,   పసుల కృష్ణప్రసాద్, తెడ్డు విజయ్  పలువురు పద్మశాలి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు

.