విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

తెలంగాణ ప్రభ (ఎళ్ళారెడ్డిపేట): సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం వ్యాప్తంగా  సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో  విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని  సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు ,

పరీక్షల్లో ఎలాంటి గందగోళానికి  లోను కాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని  విద్యార్థిని విద్యార్థులకు  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి.ఆల్ ద బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు,

.