విద్యార్థులు చక్కని క్రమశిక్షణతో, ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలి : అధ్యక్షులు మన ప్రెస్ క్లబ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాలలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ విద్యార్థుల కేరింతలు, నృత్యాలతో సందడిగా మారింది. 

ఈ ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథులు గా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లే రాము లను ప్రిన్సిపాల్ ప్రవీణ్ శాలువాతో ఘనంగా సత్కరించారు.  అనంతరం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చక్కని ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలని ఉపాధ్యాయులు సూచించిన విధంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని, ర్యాంకులతో పోటీ పడకుండా సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ పెంచుకోవాలని ఆయన సూచించారు.  అనంతరం ఫేర్వెల్ పార్టీ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్, అధ్యాపకులు డిశానిర్దేశం చేశారు. విద్యార్థులు 25 ఏళ్ళు కష్టపడితే 75 సంవత్సరాలు సంతోషకరమైన జీవితం అనుభవించవచ్చని, మీ బంగారు భవిష్యత్తుకు పదవ తరగతిలో మూలాలు ఏర్పడతాయని, తరగతి గదిలో పాఠశాలలో చేసిన అల్లర్లు తీపి గుర్తులుగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల చైర్మన్ వెంకట నారాయణ, డైరెక్టర్ శ్రీకాంత్,  డీన్ నరసింహరాజు, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

.