ఘనంగా వసంత పంచమి వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సరస్వతి విగ్రహానికి అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. 

సరస్వతి మాత దయవల్ల చదువుతోపాటు సంస్కారం విద్యతో పాటు విజ్ఞానం వినయం  విధేయతలు నేర్చుకుంటామని దేశభక్తిని,  దైవభక్తిని పెంపొందించుకోవాలని  వారు కోరారు అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడూ  మనపై ఉండాలని  అమ్మవారిని వేడుకున్నారు 

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  మిల్కీ రెడ్డి  విష్ణువర్ధన్ రాజు  సుమిత్ర రోషిని జోగదుబ్బయ్య విద్యార్థిని  విద్యార్థులు పాల్గొన్నారు

.