ప్రచారానికి తెర... అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ సుధాకర్

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మంగళవారం సాయంత్రం 05.00 లతో ప్రచారానికి తెర పడిందని, ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రచారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై సుధాకర్  హెచ్చరించారు. 

పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్లు, కండువాలు వేసుకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుంది

నేటి సాయంత్రం నుండి 30.11.2023 తేదీ వరకు 144 Cr.P.C. సెక్షన్ అమలులో ఉంటుంది.

ఈ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ లౌడ్ స్పీకర్లు పెట్టడానికి అనుమతి లేదు.

నాన్ లోకల్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు.

పై నిబంధనలతో పాటు ఇతర ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

.