తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డి పేట): అనుమానాస్పదంగా బావిలో పడి గిరిజన మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని అల్మాస్ పూర్ లో శుక్రవారం చోటుచేసుకుంది.మండలం లోని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి శుక్రవారం కల్ నాయక్ తండాలోని బావి బొందలో పడి మృతి చెందింది. లక్ష్మి భర్త మరణించగా కొడుకు కూతురు ఉన్నారు.
గురువారం బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా లక్ష్మి పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారని విశ్వసనీయ సమాచారం. లక్ష్మి కూతురు వివాహం వచ్చే నెలలో ఉండగా అనుమానాస్పదంగా భావిలో పడి మృతి చెందడం పట్ల చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.