తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): తెలంగాణ దశాబ్ది ఉత్సవము లో భాగంగా మండలంలోని పోత్తూరు గ్రామం రైతు వేదిక లో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుబంధు అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాలని సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం లోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం, రైతు బీమా పథకం,24 గంటల ఉచిత కరెంటు,ప్రాజెక్టులు, కాలువలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ ఇలాంటి ఎన్నో రైతులకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతాంగానికి సకాలంలో ఎరువులు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటదని తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ తెలంగాణ రైతన్న కొరకు ఇలాంటి అద్భుతమైన పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అందిస్తున్నారు..తెలంగాణలో ప్రతి ఇంటిలో సంక్షేమ పథకం ఉందంటే దానికి కారణం ముఖ్యమంత్రి అని అన్నారు.
2018 సంవత్సరం లోని రెండు పంటలకు గాను ఎకరానికి 8000 రూపాయల చొప్పున, 2019 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు 8 పంటలకు గాను ఎకరానికి 10000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి రైతుకు తమ భూమి పై యాజమాన్య హక్కులను కల్పించుటకు వీలుగా కొత్తగా పాస్ బుక్కల జారీ చేయడమైనది.
పొత్తూర్ క్లస్టర్ లోని గ్రామాల వారీగా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి ద్వారా లబ్ధి పొందిన కందికట్కూరు గ్రామం లోని 934 రైతులకి గాను 9.73 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది, కిస్టరావుపల్లి గ్రామం లోని 134 రైతులకి గాను 1.46 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రంగంపేట గ్రామంలోని 178 రైతులకి గాను 2.02 కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరిగింది. పోత్తూర్ గ్రామం లోని 552 రైతులకి గాను 5.87 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. నర్సక్కపేట గ్రామంలోని 443 రైతులకి గాను 5.07 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది, తెలంగాణ రైతుబీమా పథకం- తెలంగాణ రాష్ట్ర రైతులకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏ కారణంతోనైనా రైతు చనిపోతే, నామినీకి ఎల్ఎస్ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది.
ఇప్పటివరకు పొత్తూర్ క్లస్టర్ లోని 49 మంది మరణించిన రైతులకు గాను 245 లక్షల రూపాయలు వారి నామిని యొక్క బ్యాంక్ ఖాతా లో జమ చేయడం జరిగిం లోని గ్రామల వారీగా రైతుబీమా పథకం ద్వారా కందికట్కూరు గ్రామం లోని (20) మరణించిన రైతులకు గాను 100 లక్షల రూపాయలు రంగంపేట గ్రామం లోని (5) మరణించిన రైతులకు గాను 25 లక్షల రూపాయలు పోత్తూర్ గ్రామం లోని (10) మరణించిన రైతులకు గాను 50 లక్షల రూపాయలు. నర్సక్కపేట గ్రామం లోని (11) మరణించిన రైతులకు గాను 55 లక్షల రూపాయలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో RBS జిల్లా సభ్యులు - ఏలేటి మాధవ రెడ్డి , సర్పంచ్ లు సిద్ధం శ్రీనివాస్, ముత్యం అమర్, ముస్క్ మల్లయ్య, ర్యాగటి శిరీష, వజరవ్వ, ఎంపిటిసి లు పట్నం అశ్విని శ్రీనివాస్, .RBS కో- ఆర్డినేటర్ లు సిద్దం నర్సయ్య, దొమ్మటీ మహేష్, PACS డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి , ఉప సర్పంచ్ బండారి పరశురాములు, AEO లత శ్రీ, క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
.