రాష్ట్రపతి నిలయం లో జరిగిన కవి సమ్మేళనానికి ఆహ్వానం.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): ప్రముఖ బాల సాహితీవేత్త రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం రోజున నిర్వహించిన కవి సమ్మేళనం లో సిరిసిల్ల నుంచి ప్రముఖ బాల సాహితీవేత్త రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ పాల్గొన్నారు. మహిళ అభ్యుదయం అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో డాక్టర్ రాణి ప్రసాద్ వినిపించిన కవిత ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రపతి నిలయం ఇంచార్జ్ డాక్టర్ రజనీ ప్రియా ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందేపిరాణి ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తేజపూరితంగా నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య కార్యక్రమాలతో పాటు రాష్ట్రపతి నిలయం సందర్శించే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
