తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణం లోని నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాద రావు 89 వ జయంతి ఘనంగా నిర్వహించారు. శ్రీపాద రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు ఆయన చేసిన సేవలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండాలద్యక్షులు సంగనభట్ల దినేష్,ఉపాధ్యక్షులు వేముల రాజేష్,చిలుముల లక్ష్మణ్,సీపతి సత్యనారాయణ,జక్కు పద్మ రవిందర్, వొజ్జల లక్ష్మణ్,అప్పం తిరుపతి,రఫీయొద్దిన్, గరిగే రమేష్,గాజు సాగర్,ఎండీ షబ్బీర్,స్తంభంకాడి గణేష్,నరేందర్, బొల్లారపు పోషన్న,గుడ్ల రవీందర్,రమణ,సత్తన్న,శరత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
